Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిడ్జిపై నుంచి పడిన వాహనాలు

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Aug 09, 2026 7:22 AM అనంతపురంఆంధ్రప్రదేశ్
బ్రిడ్జిపై నుంచి పడిన వాహనాలు - Udayam Digital
అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఐషర్‌ వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు బ్రిడ్జిపై నుంచి పడిపోగా, బస్సులోని 20 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను పామిడి ప్రభుత్వ, అనంతపురం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోగా, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి రాకపోకలను క్రమబద్ధీకరించారు.

Comments

G
Loading comments...