Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడల్లో సత్తాచాటిన వీరఘట్టం ఉద్యోగులు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 08, 2026 12:35 PM పార్వతీపురం మన్యంGeneral
క్రీడల్లో సత్తాచాటిన వీరఘట్టం ఉద్యోగులు - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి క్రీడాపోటీల్లో వీరఘట్టం ఉద్యోగులు సత్తాచాటారు. 50 మీటర్ల పరుగు పందెంలో వీరఘట్టం సచివాలయం-4 మహిళా పోలీసు సంతోషికుమారి ప్రథమ స్థానం సాధించారు. టగ్‌ ఆఫ్‌ వార్‌ పురుషుల విభాగంలో వీరఘట్టం జట్టు ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. విజేతలను మండల అధికారులు అభినందించారు.

Comments

G
Loading comments...