Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీని ఢీకొట్టిన వ్యాన్: ఇద్దరు మృతి

వినయ్ కుమార్ Jul 22, 2026 8:58 PM కరీంనగర్in about 3 hours
లారీని ఢీకొట్టిన వ్యాన్: ఇద్దరు మృతి - Udayam Digital
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్ గేటు సమీపంలో ఆగి ఉన్న బొగ్గు లారీని డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మనోహర్ పాల్, సూర్యవంశీ మృతి చెందారు. వ్యాన్ నుజ్జునుజ్జు అవ్వడంతో డ్రైవర్ అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన మరొకరు గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...