వార్తలకు తిరిగి వెళ్లండి

వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైరా ఐబీ కార్యాలయం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మహాధర్నా చేపట్టారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎండిపోతున్న పంటలను తలచుకుని ఓ రైతు ఎస్ఐ పుష్పల రామారావు కాళ్లపై పడి సాగునీరు ఇప్పించాలని వేడుకున్నారు. ఘటన అక్కడివారిని కలచివేసింది.
Comments
Loading comments...

