వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో వైద్యం వికటించి కేజీబీవీ 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. జ్వరం, జలుబుతో ఉన్న బాలికకు స్థానిక ఆర్ఎంపీ ఇంజక్షన్ ఇవ్వడంతో తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తి ప్రాణాలు కోల్పోయింది.
ఆ ఆర్ఎంపీ మద్యం మత్తులో తప్పుడు వైద్యం అందించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, నిందితుడైన ఆర్ఎంపీ పరారీలో ఉన్నాడు.
Comments
Loading comments...

