వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా వరాలతల్లి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
కుటుంబాల్లో అష్ట ఐశ్వర్యాలు సుఖసంతోషాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. పూజల అనంతరం మహిళలు పరస్పరం వాయినాలు పంచుకున్నారు.
Comments
Loading comments...

