వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మందస గ్రామదేవత శ్రీ అన్నపూర్ణమ్మ దేవాలయం ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు.
వేద మంత్రోచ్ఛారణల నడుమ వ్రత కార్యక్రమాలు ఘనంగా సాగాయి.స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

