Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవంగా ప్రసన్నాంజనేయ స్వామి పల్లకి సేవ

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 8:51 PM బాపట్లGeneral
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సాయంత్రం స్వామి వారి పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి సమర్పించిన అనంతరం పల్లకి సేవను ప్రారంభించారు. విశేషంగా అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉత్సవమూర్తిని ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు పల్లకిని తమ భుజాలపై మోస్తూ, స్వామివారిని దర్శించుకొని తరించారు.

Comments

G
Loading comments...