వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం పీహెచ్సీ పరిధిలోని బిల్లగుంది, గౌతమ్ బుద్ధ కాలనీ చెంచుగూడెంలో శుక్రవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గర్భిణులు, చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు వేశారు.
అనంతరం బిల్లగుంది ఆశ్రమ పాఠశాలను సందర్శించిన వైద్య బృందం విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన కల్పించింది.
Comments
Loading comments...

