వార్తలకు తిరిగి వెళ్లండి

శృంగవరపుకోట (M) వేములపల్లికి చెందిన డాక్యార్డ్ ఉద్యోగి సుధాకర్ (37) ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు దుబాయ్ లోని స్నేహితుడికి 'మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా' అంటూ వాట్సాప్ సందేశం పంపారు. అనంతరం గ్రామ శివారులో ఉరేసుకున్నారు.
ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Loading comments...

