వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలంతా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని ఎమ్మెల్యే శంకర్ ఆదివారం పిలుపునిచ్చారు.
వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం, గార మండలాల్లో సుమారు 25 వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు MLA తెలిపారు. ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.
Comments
Loading comments...

