వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమల బుకింగ్స్ కోసం అధికారిక వెబ్సైట్నే వాడండి

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవల బుకింగ్స్ కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలని అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. నకిలీ వెబ్సైట్లు, మధ్యవర్తుల తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆయన భక్తులకు సూచించారు.
భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ మార్గాల్లో డబ్బులు వసూలు చేసే నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. బుకింగ్స్ విషయంలో జాగ్రత్త వహించాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...