Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైన ఏపీ విద్యార్థిని

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 15, 2026 1:22 PM విజయనగరంGeneral
నేషనల్ టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైన ఏపీ విద్యార్థిని - Udayam
చీపురుపల్లి మండలం పెదనడిపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. దివ్య చరిత జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైంది. ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో జరిగిన 38వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించింది. ఈ విజయంతో అక్టోబర్ 17 నుండి పంజాబ్‌లో జరిగే జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ఆడే అవకాశాన్ని ఈ విద్యార్థిని దక్కించుకుంది. జాతీయ స్థాయిలోనూ రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని పాఠశాల సిబ్బంది, స్థానికులు ఆమెను అభినందించారు.

Comments

G
Loading comments...