వార్తలకు తిరిగి వెళ్లండి
ఆస్తి తగాదాలతో భార్యను హతమార్చిన భర్త

ధవళేశ్వరంలో ఆస్తి తగాదాలు, కుటుంబ గొడవల నేపథ్యంలో క్షణికావేశంలో కట్టుకున్న భార్య నాగమణిని భర్త వరప్రసాద్ కడతేర్చాడు. మంగళవారం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రాజమహేంద్రవరం గ్రామీణ శివారు రాజవోలు కోనేరు వీధికి చెందిన వరప్రసాద్ వడ్రంగి పని చేస్తుంటాడు. ఆస్తి వివాదాల కారణంగా వడ్రంగి పని చేసే పరికరంతో నాగమణిపై దాడి చేయడంతో ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...