వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆపాస్ జిల్లా అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాస్ తెలిపారు. కే.గంగవరం మండలం కుందూరు ఉన్నత పాఠశాలలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, టెట్ సమస్యలపై రాష్ట్ర నాయకత్వం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆపాస్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, హెచ్ఎం బొండా శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

