Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అరెస్ట్

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Aug 04, 2026 7:01 PM మార్కాపురంఆంధ్రప్రదేశ్
పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అరెస్ట్ - Udayam Digital
మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ డివిజన్ పరిధిలో పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గిద్దలూరుకు చెందిన అంజి, నంద్యాల జిల్లాకు చెందిన వీరాంజనేయులను విచారణ కోసం గిద్దలూరుకు తరలించారు. గుండ్లకమ్మ అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టగా ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...