వార్తలకు తిరిగి వెళ్లండి

కనగానపల్లి మండలం ముక్తాపురానికి చెందిన సాకే రమేశ్ (25) వ్యవసాయం పనిచేస్తుండగా ట్రాక్టర్ తిరగ బడి మరణించాడు.
మంగళవారం వేరుశనగ కాయలను ఆడించే ట్రాక్టర్పై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ కింద పడి రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ముక్తాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

