వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ 2వ వార్డులో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వ్యాధి నిరోధక టీకాలు, తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 20 మంది చిన్నారులకు టీకాలు అందించారు.
అలాగే 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దయాల చంద్రకళ–శంకర్, అంగన్వాడీ టీచర్ అరుణ, ఏఎన్ఎం శిరీష, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

