వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు ఇప్పిస్తానంటూ భక్తులను మోసగిస్తున్న టిటిడి మాజీ ఉద్యోగి అరుణ్కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన వారి వద్ద నుంచి రూ.3.20 లక్షలు వసూలు చేయడంతో బాధితుల ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఇతని బ్యాంకు ఖాతాల్లో ఏడాది వ్యవధిలో రూ.85 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.99,000 నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

