వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి రూరల్ పరిధిలో 26 విద్యుత్ మోటార్ల చోరీకి సంబంధించి నమోదైన 6 కేసుల్లో ఆరుగురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాడికొండ మండలం ఫణిదం గ్రామానికి చెందిన ఈ నిందితులను జులై 27న పొన్నూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్న వారిని పీటీ వారెంట్పై బుధవారం తెనాలి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Comments
Loading comments...

