Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌, హెగ్సెత్ మధ్య వాగ్వాదం

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 06, 2026 3:28 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ట్రంప్‌, హెగ్సెత్ మధ్య వాగ్వాదం - Udayam Digital
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మధ్య క్షిపణి నిల్వల అంశంపై వాగ్వాదం జరిగినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు వెల్లడించాయి. క్షిపణి నిల్వలపై పూర్తి సమాచారం ఇవ్వలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలు తెలిపాయి. అయితే, ఈ విషయంపై అమెరికా ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.

Comments

G
Loading comments...