వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతిలో జంట హత్యల కలకలం

తిరుపతి పద్మావతి కల్యాణ మండపం వద్ద బుధవారం రాత్రి మునిరత్నం యాదవ్, మణికంఠ అనే ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఒక పాత వివాదంలో మధ్యవర్తులుగా వచ్చిన వీరిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశారు.
నిందితుడు సునీల్, అతని కుటుంబ సభ్యులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Loading comments...