వార్తలకు తిరిగి వెళ్లండి

స్టార్ హీరోయిన్ త్రిష పేరుతో మధురైలో ఏర్పాటు చేసిన త్రిష ఛారిటీ ఫౌండేషన్ ఆవిర్భావం సందర్భంగా రాజకీయ చర్చ మొదలైంది. త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు భారీ పోస్టర్లు ఏర్పాటు చేశారు.
‘వీరమంగై వేలు నాచియార్’గా త్రిషను సంబోధిస్తూ ఏర్పాటు చేసిన పోస్టర్లలో స్వాతంత్య్ర పోరాట యోధురాలు వేలు నాచియార్ చిత్రాన్ని కూడా ఉంచారు. ఈ వ్యవహారం తమిళనాడులో ఆసక్తి రేపుతోంది.
Comments
Loading comments...
