వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. సమగ్ర శిక్షణ అభియాన్ ద్వారా 12 మండలాలకు రూ.3 లక్షలు మంజూరు చేశారు. 13 భవిత కేంద్రాల్లో 1,125 మంది దివ్యాంగ పిల్లలు ఉన్నారు.
వారిలో 400 మందిని ఈనెల 19న విహారయాత్రకు తీసుకెళ్లనున్నారు. దివ్యాంగులకు మండల, జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

