వార్తలకు తిరిగి వెళ్లండి
తొట్టంబేడులో ట్రాక్టర్ బోల్తా: మహిళ మృతి

తిరుపతి జిల్లా రౌతుసూరమాల సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఆదెమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు వారిని శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు.
శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ కింద చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించగా, మిగిలిన వారికి తృటిలో ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...