వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని నూతన ఆర్డీవో అరుణాదేవిని ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ పాలకమండలి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఛైర్మన్ పాండురంగయ్య శెట్టి ఆమెతో చర్చించారు.
నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ప్రభుత్వం నుండి నిధులు విడుదలయ్యేలా చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో వాణితో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

