వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఏడాదిలో తొలి తుఫాను ఏర్పడటానికి బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు IMD అంచనా వేసింది. ఈ నెల 19న ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి ఈ నెల 22-26 నాటికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉందని తెలిపింది.
ఇది తుఫానుగా మారడంపై 2, 3 రోజుల్లో స్పష్టత రానుందని చెప్పింది. ఈ తుఫానుకు బంగ్లాదేశ్ సూచించిన 'ఆర్నబ్' పేరు పెట్టనున్నారు. దీనివల్ల భారీ వర్షాలు కురవనున్నాయి.
Comments
Loading comments...

