Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమ్మినేని సీతారాం పార్టీ మారుతారా

Follow Udayam on Google
RAGHU SKLM Aug 27, 2026 8:59 AM శ్రీకాకుళంGeneral
తమ్మినేని సీతారాం పార్టీ మారుతారా - Udayam
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్తుపై శ్రీకాకుళం జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆగస్టు 25న జరిగిన సమన్వయకర్తల సమావేశానికీ హాజరుకాలేదు. ఆముదాలవలస ఇన్‌ఛార్జ్ పదవి కుమారుడికి దక్కకపోవడం కూడా ఇందుకు కారణమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో గుర్తింపు లేకపోవడంతో ఆయన జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...