వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాలు చిన్నారులకు అమృతంతో సమానమని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం జన్నారం మండలంలోని ధర్మారం అనుబంధ గోండుగూడా గ్రామ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలలో ఆయన పాల్గొన్నారు.
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి తప్పనిసరిగా ముర్రె పాలు తాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆత్రం గోదావరి, అంగన్వాడీ టీచర్ సంధ్య, స్థానిక మహిళలు ఉన్నారు.
Comments
Loading comments...

