వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో సురేఖ (25) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వికారాబాద్ జిల్లా యాచారంకు చెందిన ఆమె, కులాంతర వివాహానికి అడ్డొస్తున్నారని 7 నెలల క్రితం తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది.
ఇటీవల జైలు నుంచి విడుదలై హాస్టల్లో ఉంటున్న సురేఖ, గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

