వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
తిరుపతిలో దర్శన టోకెన్లు రద్దు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో తిరుపతిలోని కేంద్రాల వద్ద బుధవారం ఎస్ఎస్డీ టోకెన్ల జారీని తితిదే రద్దు చేసింది. మంగళవారం జారీ చేసిన 8 వేల మంది భక్తులకు బుధవారం మధ్యాహ్నం నుంచి దర్శన భాగ్యం కల్పించనున్నారు.
అయితే శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం యథావిధిగా టోకెన్లు ఇస్తామని అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి బుధవారం టోకెన్ల జారీ ప్రక్రియను కొనసాగించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...