వార్తలకు తిరిగి వెళ్లండి
ముద్రగడ పద్మనాభం కన్నుమూత

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ గచ్చిబౌలిలోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం వ్యక్తమవుతోంది.
ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడికి బుధవారం తరలించి, అభిమానుల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...