Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీల మధ్య ఇరుక్కుని ఒకరి మృతి

నవీన్ రెడ్డి Jul 15, 2026 8:46 AM విశాఖపట్నం 3 viewsabout 1 hour ago
లారీల మధ్య ఇరుక్కుని ఒకరి మృతి - Udayam Digital
విశాఖ జిల్లా పెందుర్తి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాపారి కీర్తి మాణిక్యాలరావు మినీ వ్యాన్‌లో వెళ్తుండగా ట్యాంకర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రెండు లారీల మధ్య ఇరుక్కుపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...