వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 15 నుండి 23 వరకు తిరుపతిలో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భరతనాట్య ప్రదర్శనకు విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ జవహర్ బాలభవన్కు చెందిన 22 మంది చిన్నారులు ఎంపికయ్యారు.
ఈ మేరకు ఈ నెల 20న హనుమంత వాహన సేవలో స్వామివారి ఊరేగింపులో చిన్నారులు భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారని బాలభవన్ నిర్వాహకులు సతీష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

