వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ అడవుల్లో పెద్దపులి అదృశ్యం

ఉమ్మడి నిజామాబాద్ అడవుల్లో వరుస వన్యప్రాణుల వేట ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల చిరుతల మరణాలు వెలుగుచూడగా, గత మార్చిలో అడవిలోకి వచ్చిన పెద్దపులి జాడ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ మగపులి ఐదు నెలల క్రితం అదృశ్యమైంది. ఆ సమయంలోనే చిరుతలను వేటాడిన ఘటనలు జరగడంతో, పెద్దపులికి కూడా ప్రమాదం జరిగిందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...