వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కామవరంలో పులి ఓ పశువుపై దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం గుబ్బలమంగమ్మ గుడి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని వెల్లడించారు.
రైతులు, కూలీలు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని, పశువులను ఇళ్ల వద్దే ఉంచుకోవాలని డీఎఫ్వో సందీప్ సూచించారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Comments
Loading comments...
