వార్తలకు తిరిగి వెళ్లండి
అధికారులు బంధించే క్రమంలో పులి మృతి

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో తాడోబా అభయారణ్యం పరిధిలో టి-202 అనే ఆడ పులి మృతి చెందింది. ఓ వ్యక్తిని హతమార్చిన ఈ పులిని బంధించేందుకు అధికారులు మత్తుమందు ప్రయోగించగా అది ప్రాణాలు కోల్పోయింది.
గతంలో బంధించి కోర్ జోన్లో వదిలినప్పటికీ ఎలాంటి ఆహారం తీసుకోకుండా మళ్లీ గ్రామాల వైపు రావడంతో ఈ చర్యలు చేపట్టారు. శవపరీక్ష తర్వాత మృతికి గల కారణాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...