వార్తలకు తిరిగి వెళ్లండి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా జప్తలై గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్లో ఆరుగురు బాలికలను పాము కాటేసింది. నిద్రిస్తున్న సమయంలో జరిగిన ఘటనలో 8, 12, 14 ఏళ్ల ముగ్గురు బాలికలు చికిత్స పొందుతూ మృతి చెందారు.
మరో ముగ్గురికి చికిత్స కొనసాగుతుండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
Comments
Loading comments...

