వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో వర్షాభావ, దుర్భిక్ష పరిస్థితుల నుంచి రక్షణ కోరుతూ వచ్చే నెల 1న శ్రీమృత్యుంజయ శివలింగానికి 'సహస్రఘటాభిషేకం' నిర్వహించనున్నారు. 2015 జులై తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ విశేషోత్సవం జరుగుతోంది.
సోమసూత్రంతో కూడిన ఈ మృత్యుంజయ శివలింగాన్ని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగుతాయని భక్తుల నమ్మకం. పంచభూతాత్మకుడైన ఆ సర్వేశ్వరుని ఇక్కడ ప్రత్యేకంగా ఆరాధిస్తారు.
Comments
Loading comments...

