వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా కరపలో చోరీ చేసిన బంగారు ఆభరణాలను దొంగలు తిరిగి ఇచ్చేసిన వింత ఘటన చోటుచేసుకుంది. గత నెల 18న గణేశ్ ఇంట్లో రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు చోరీకి గురయ్యాయి.
ఆదివారం దొంగలు ఆభరణాలతో పాటు రూ.28 వేల నగదును ఇంట్లోకి విసిరేసి, 'తప్పయింది.. రూ.22 వేలు వాడుకున్నాం, తిరిగివ్వలేం' అంటూ లేఖ రాసి వదిలివెళ్లారు. ఈ ఘటన కరపలో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

