వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాస్ నగర్లో ఉన్న ఆయన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

