వార్తలకు తిరిగి వెళ్లండి
విజయవాడలో ఉద్రిక్తత

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ విజయవాడలో విద్యార్థి సంఘాలు లోక్భవన్ ముట్టడికి భారీగా ప్రయత్నించాయి. ఈ ఆందోళనను పోలీసులు తీవ్రంగా అడ్డుకోవడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసుల వలయాలను ఛేదించేందుకు విద్యార్థులు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Comments
Loading comments...