Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత

భవేష్ కుమార్ Jul 22, 2026 3:18 PM హైదరాబాద్in about 4 hours
రాహుల్, ప్రియాంక అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ ముట్టడికి యత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఓ రిపోర్టర్‌కు గాయాలవగా, పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...