వార్తలకు తిరిగి వెళ్లండి
ఆలయాల ప్రక్షాళన, ఆధ్యాత్మిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం: మంత్రి ఆనం
Sindhu Jun 22, 2026 8:40 AM కృష్ణా జిల్లా 2 viewsabout 2 hours ago

గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలను ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదాయం లేని ఆలయాల అభివృద్ధికి ప్రతి నెలా రూ. 10 వేలు అందిస్తున్నామన్నారు.
దేవాదాయ శాఖలో డిజిటల్ వ్యవస్థను ప్రవేశపెట్టి పారదర్శకతను పెంచామని, అవినీతిని అరికట్టామని ఆయన పేర్కొన్నారు. త్వరలో 65 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ప్రారంభిస్తామని, భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...