వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు అవసరమైనంత డీఏపీ ఎరువులు సరఫరా చేయాలని కోరుతూ నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ రైతులకు డీఏపీ కొరత లేకుండా చూడాలని కోరారు. వినతిపత్రంపై కాంగ్రెస్ లోక్సభ ఎంపీలందరూ సంతకాలు చేశారు. రైతుల అవసరాల మేరకు తగినంత డీఏపీ సరఫరా చేయాలని కోరగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
Comments
Loading comments...

