Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నీళ్లను ఏపీకి తరలిస్తే ఊరుకోం: శ్రీనివాస్ గౌడ్

Follow Udayam on Google
sreekanth patel Aug 15, 2026 5:27 PM మహబూబ్‌నగర్General
తెలంగాణ నీళ్లను ఏపీకి తరలిస్తే ఊరుకోం: శ్రీనివాస్ గౌడ్ - Udayam
మహబూబ్‌నగర్: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. కృష్ణా రివర్ బేసిన్‌లో తెలంగాణకు 30 శాతం నీటి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీల వ్యవహారంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 300 టీఎంసీల నీటిని వినియోగిస్తోందని ఆరోపించారు. పాలమూరును ఎండబెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...