వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరం (M) మధుపాడ విశాఖ డెయిరీ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
వాహనం ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆధార్ వివరాల ప్రకారం.. కురుపాం (M) దండుసూర గ్రామానికి చెందిన ఇరమమ్మగా గుర్తించినట్లు SI కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.
Comments
Loading comments...

