Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ హత్యలకు అడ్డాగా మారింది: రాజాసింగ్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 22, 2026 2:27 PM హైదరాబాద్General
తెలంగాణ హత్యలకు అడ్డాగా మారింది: రాజాసింగ్  - Udayam
మీర్‌పేట్‌లో రౌడీషీటర్ సూరి హత్య సంచలనం సృష్టించిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వందల హత్యలు జరిగాయని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్‌ను కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. హోంశాఖను వేరే వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...