వార్తలకు తిరిగి వెళ్లండి
మనసులు గెలిచిన ఉపాధ్యాయులు

ఆదిలాబాద్ కోలిపుర ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో ఆటోలు ఏర్పాటు చేసి బడిని కాపాడుకుంటున్నారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేద పిల్లలు పాఠశాలకు వచ్చేలా ప్రతి నెలా తమ సొంత డబ్బులను వెచ్చిస్తున్నారు.
ఎనిమిది మంది ఉపాధ్యాయులు నెలకు రూ.3 వేల చొప్పున వేసి ఆటోలు, పిక్నిక్, తాగునీటి కోసం ఏటా రూ.2.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వీరి చొరవతో బడిలో విద్యార్థుల సంఖ్య 68కి చేరింది.
Comments
Loading comments...