వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ

విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని ఆర్పీలు లీలావతి, పరమేశ్వరి, ఉమాదేవి, రామచందర్ సూచించారు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణలో శనివారం కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా కృత్యాలు రూపొందించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. డిజిటల్ తెర ద్వారా బోధనా మెళకువలను వివరించారు.
Comments
Loading comments...